సౌదీ చేస్తున్న కొత్త ఆలోచనలు
- September 17, 2018రియాద్ : సౌదీ అరేబియా పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త చర్యలు చేపట్టింది. ఉమ్రా యాత్ర కోసం వీసాతో సౌదీఅరేబియాకు వచ్చే భక్తులు ఇక నుంచి 30 రోజుల్లో దేశంలోని అన్ని నగరాలను పర్యటించవచ్చని ఆ సర్కారు ప్రకటించింది. ఉమ్రా యాత్రలో భాగంగా భక్తులు 15 రోజుల పాటు మక్కా, మదీనాల్లోని పెద్ద మసీదులను సందర్శించాలని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ వజ్జన్ చెప్పారు. హజ్ యాత్ర ముగిసిన నేపథ్యంలో గడచిన నాలుగురోజుల్లో 25వేల మందికి ఉమ్రా కోసం వీసాలు జారీ చేశామని అజీజ్ వెల్లడించారు. సౌదీలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ కొత్త నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం