సౌదీ చేస్తున్న కొత్త ఆలోచనలు

- September 17, 2018 , by Maagulf
సౌదీ చేస్తున్న కొత్త ఆలోచనలు

రియాద్ : సౌదీ అరేబియా పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త చర్యలు చేపట్టింది. ఉమ్రా యాత్ర కోసం వీసాతో సౌదీఅరేబియాకు వచ్చే భక్తులు ఇక నుంచి 30 రోజుల్లో దేశంలోని అన్ని నగరాలను పర్యటించవచ్చని ఆ సర్కారు ప్రకటించింది. ఉమ్రా యాత్రలో భాగంగా భక్తులు 15 రోజుల పాటు మక్కా, మదీనాల్లోని పెద్ద మసీదులను సందర్శించాలని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ వజ్జన్ చెప్పారు. హజ్ యాత్ర ముగిసిన నేపథ్యంలో గడచిన నాలుగురోజుల్లో 25వేల మందికి ఉమ్రా కోసం వీసాలు జారీ చేశామని అజీజ్ వెల్లడించారు. సౌదీలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ కొత్త నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com