నేడు భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్..
- September 18, 2018దుబాయ్: దాదాపు 14 నెలల తర్వాత... క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్న ఓ ఉత్కంఠ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. చరిత్ర.. గణాంకాలు.. రికార్డులు.. రివార్డులు.. విశ్లేషణలు.. విమర్శలు.. భావోద్వేగాలు.. వీటన్నింటిని పక్కనబెడితే మ్యాచ్ను చూస్తే చాలు అనుకునే అభిమానగణం ఆనందోత్సాహాల్లో తేలియాడే అపురూపమైన క్షణాలకు సమయం ఆసన్నమైంది. విజయబావుటకు, ఓటమిబాటకు అతి స్వల్ప తేడా ఉండే అత్యుత్తమ సమరానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో.. బుధవారం ఆసియా కప్లో భాగంగా జరిగే గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్లో భారత్.. పాక్తో అమీతుమీ తేల్చుకోనుంది. పేపరు మీద చూస్తే ఇరుజట్లు బలంగానే కనిపిస్తున్నా.. మైదానంలో అసలు సిసలు ఆట ఎవరూ ఆడుతారన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. గతేడాది చాంపియన్స్ ట్రోఫీలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తుంటే.. చరిత్రను పునరావృతం చేస్తామని దాయాది జట్టు ధీమాతో ఉంది. ఎన్ని విశ్లేషణలు చేసినా.. ఎన్ని రకాలుగా మాట్లాడినా.. నిజాయితీగా భారత్ బ్యాటింగ్ బలానికి, పాక్ బౌలింగ్ బలగానికి మధ్య జరిగే అత్యంత కఠిన పరీక్ష ఇది. ఇందులో ఎవరు నెగ్గుతారో.. ఎవరు తగ్గుతారో చూడాలి..!
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ