భారత్, పాక్‌ మ్యాచ్‌కు దావూద్ అనుచరులు హాజరవుతారట!

- September 18, 2018 , by Maagulf
భారత్, పాక్‌ మ్యాచ్‌కు దావూద్ అనుచరులు హాజరవుతారట!

ఆసియా కప్‌లో భారత్, పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం అనుచరులు హాజరవుతారని ఆరు అంతర్జాతీయ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీలకు సమాచారం అందింది. ఈ మ్యాచ్‌ పై నిఘా వర్గాలు దృష్టి సారించాలని నిర్ణయించాయి. దావూద్ అనుచరులు మ్యాచ్‌కు హాజరవుతున్నారని వార్తలు రావడంతో పాటు, కరాచి, ముంబైలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు దుబాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భారత్‌తో పాటు యూకే, యూఎస్‌, రష్యా, చైనా సంస్థలు తమ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com