వలసదారుడి హత్య కేసులో ఒమన్ జాతీయుడి అరెస్ట్
- October 05, 2018ఒమన్:నార్త్ బతినాలో ఓ వలసదారుడి హత్య కేసులో ఒమన్ జాతీయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వలసదారుడ్ని వాహనంతో ఢీకొని, సంఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్తో కలిసి విస్తృతమైన సోదాలు నిర్వహించడంతో నిందితుడి ఆచూకీ దొరికిందని సహామ్ పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వుంటే బతికేవాడనీ, సకాలంలో అతనికి వైద్య చికిత్స అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Four expat workers found dead at shipping port in Oman
ఒమన్ షిప్పింగ్ పోర్టులో నలుగురు వలసదారుల మృతి
ఓ షిప్ని క్లీన్ చేస్తుండగా, అందులో ఇరుక్కుపోయి నలుగురు వలస కార్మికులు మృతి చెందినట్లు ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) పేర్కొంది. సలాలా పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురూ ఆసియా జాతీయులని పిఎసిడిఎ వెల్లడించింది. షిప్ని క్లీన్ చేస్తుండగా నలుగురు కార్మికులు ఇరుక్కుపోయారని సమాచారం అందడంతో, పిఎసిడిఎ - హజార్డస్ మెటీరియల్స్ డీలింగ్ టీమ్ రంగంలోకి దిగి, వారి ఈచూకీని కనుగొన్నట్లు పిఎసిడిఎ వర్గాలు పేర్కొన్నాయి. వారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అప్పటికే వారు మృతి చెందడం జరిగింది.
తాజా వార్తలు
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం