దాడి కేసులో ముగ్గురికి జైలు

- October 11, 2018 , by Maagulf
దాడి కేసులో ముగ్గురికి జైలు

బహ్రెయిన్: హై క్రిమినల్‌ కోర్టు ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధించింది. బహ్రెయినీ వ్యక్తిపై నిందితులు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్లో ఓ మహిళ కూడా వున్నారు. మరో ఇద్దరిలో ఒకరి వయసు 22 ఏళ్ళు కాగా, ఇంకొకరి వయసు 15 ఏళ్ళు. ట్రాఫిక్‌ వివాదం ఈ దాడికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఓ మహిళపై నిందితులు దాడి చేయగా, బాధితురాలు తన భర్తకు విషయం చెప్పింది. దాంతో భర్త, తన భార్యపై దాడి చేసినవారిన నిలదీసే ప్రయత్నం చేయగా మరో దాడి జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com