ఇల్లీగల్ కార్ వాష్: 500 దిర్హామ్ల జరీమానా
- October 11, 2018షార్జా: ఇల్లీగల్ కార్ వాష్కిగాను 500 దిర్హామ్ల జరీమానా విధిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ ప్రాంతాల్లో, స్ట్రీట్స్పైనా, రెసిడెన్షియల్ ఏరియాస్లోనూ ఇల్లీగల్ కార్ వాష్ చేయించినందుకుగాను మొత్తం 681 మంది కార్ ఓనర్లకు గత క్వార్టర్లో జరీమానాలు విధించారు. ఇల్లీగల్ కార్ వాషింగ్కి 250 నుంచి 500 దిర్హామ్ల వరకు జరీమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. వాచ్మెన్, ఇల్లీగల్ వర్కర్స్, ఇతరులు సాయంత్రం వేళల్లో భవనాల వద్ద, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కార్లను వాష్ చేస్తున్నారని ఇన్స్పెక్షన్ టీమ్స్ గుర్తించాయి. ఈ నేపథ్యంలో తనిఖీల్ని మరింత ముమ్మరం చేసి, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..