ఇల్లీగల్ కార్ వాష్: 500 దిర్హామ్ల జరీమానా
- October 11, 2018షార్జా: ఇల్లీగల్ కార్ వాష్కిగాను 500 దిర్హామ్ల జరీమానా విధిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ ప్రాంతాల్లో, స్ట్రీట్స్పైనా, రెసిడెన్షియల్ ఏరియాస్లోనూ ఇల్లీగల్ కార్ వాష్ చేయించినందుకుగాను మొత్తం 681 మంది కార్ ఓనర్లకు గత క్వార్టర్లో జరీమానాలు విధించారు. ఇల్లీగల్ కార్ వాషింగ్కి 250 నుంచి 500 దిర్హామ్ల వరకు జరీమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. వాచ్మెన్, ఇల్లీగల్ వర్కర్స్, ఇతరులు సాయంత్రం వేళల్లో భవనాల వద్ద, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కార్లను వాష్ చేస్తున్నారని ఇన్స్పెక్షన్ టీమ్స్ గుర్తించాయి. ఈ నేపథ్యంలో తనిఖీల్ని మరింత ముమ్మరం చేసి, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత