ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఒమనీ విద్యార్థుల మృతి
- October 11, 2018మస్కట్: ఫ్లోరిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరు ఒమనీ స్టూడెంట్స్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారని ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంది. మృతి చెందినవారిని మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ మషారి, మొహమ్మద్ బిన్ సౌద్ అల్ తోబిగా గుర్తించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరూ చనిపోయారని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంటూ, వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మినిస్ట్రీ తెలిపింది. గాయపడ్డ విద్యార్థి వకాస్ అల్ సియాబీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..