సోమాలియాలో ఆత్మాహుతి దాడులు, 14 మంది మృతి
- October 14, 2018సోమాలియాలోని బైడొ నగరంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. స్థానిక బిలాన్ హోటల్, బద్రి రెస్టారెంటు లక్ష్యంగా ఇద్దరు ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడుల్లో 14 మంది చనిపోగా .. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఆత్మాహుతి దాడులకు తామే కారణమని ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మంత్రి ఉగాస్ హాసన్ ఇబ్రహీం వెల్లడించారు.
గత మూడు దశాబ్దాలుగా హింస, అభద్రత, రాజకీయ సంక్షోభం వల్ల సోమాలియా అతలాకుతలం అవుతోంది. ఆఫ్రికన్ శాంతి పరిరక్షక దళాల సంఘాల జోక్యంతో ప్రభుత్వంలో ఏర్పడ్డ అంతర్గత విభేదాలు, వివిధ రకాల ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే సోమాలియాలో వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత