ఆటో డ్రైవర్ అకౌంట్లోకి రూ. 300 కోట్లు..
- October 14, 2018పాకిస్థాన్:ఆటో డ్రైవర్ ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 వందల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. కరాచీ పట్టణానికి చెందిన ముహమ్మద్ రషీద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల రషీద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దాంతో వెంటనే రషీద్ను అదుపులోకి తీసుకుని ఇంతమొత్తంలో నగదు లావాదేవీలు ఎలా జరిగాయన్న దానిపై ఆరాతీశారు. దానికి రషీద్ తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని సమాధానం చెప్పాడు. ఇంటి అద్దె కట్టలేని రషీద్.. తన అకౌంట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో లావాదేలు జరగడంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అయితే ఈ బ్యాంకు ఖాతాని 2005లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీ వారు ఓపెన్ చేశారని.. తన జీతం డబ్బులు అందులో వేసేవారని. కొద్ది నెలల తర్వాత తాను ఆ ఉద్యోగం మానేసి ఆటో తోలుకుంటున్నాని అన్నాడు. తన జీవితంలో ఇంత వరకు లక్ష రూపాయలు కూడా చూడలేదు.. అలాంటిది మూడువందల కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉందనడం నా ఊహకు కూడా అందని విషయం. అంటూ నిరాశగా వెల్లడించాడు రషీద్. కాగా ఆ డబ్బు ఎవరి అకౌంట్ లోనుంచి ఎవరికీ చేరిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..