తిత్లీ బాధితులకు అండ.. విజయ్ దేవరకొండ..
- October 14, 2018సినిమాల్లో హీరోలు అన్యాయాన్ని ఎదిరిస్తారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారు. కానీ నిజజీవితంలో కూడా అవసరమైనప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చి చేయూతనందిస్తారు కొందరు హీరోలు. వారే నిజమైన హీరో అనిపించుకుంటారు.
మొన్న పక్కరాష్ట్రం కేరళ వరదబాధితుల్ని అక్కున చేర్చుకుని అండగా నిలబడింది తెలుగు ఇండస్ట్రీ. అదే విధంగా ఇప్పుడు తిత్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లాలో వందల గ్రామాలకు భారీ నష్టం సంభవించడంతో సీఎం చంద్రబాబు కేంద్ర సాయాన్ని కోరారు. బాధితులకు అండగా నటుడు సంపూర్ణేష్ బాబు ముందుగా స్పందించి కొంత సాయమందించారు. మరో నటుడు విజయ్ దేవరకొండ రూ.5 లక్షల సాయం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు పంపినట్లు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘లేహ్లో ఉన్న తనకు ఇక్కడకు వచ్చాకే తిత్లీ తుఫాను గురించి తెలిసిందని వెంటనే స్పందించానని అన్నారు. గతంలో కేరళను ఆదుకున్న మనం ఇప్పుడు మన వారిని కూడా పెద్దమనసుతో ఆదుకోవాలంటూ విజయ్ పిలుపునిచ్చారు’. ఇంతకు ముందు కూడా తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చి తన గొప్పమనసు చాటుకున్నారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ