నార్తరన్ గవర్నరేట్ స్కూల్లో కార్పొరేల్ పనిష్మెంట్
- October 15, 2018బహ్రెయిన్:నార్తరన్ గవర్నరేట్లోని ఓ పబ్లిక్ స్కూల్లో ఎలిమెంటరీ విద్యను అభ్యసిస్తోన్న తమ చిన్నారిపై టీచర్ దారుణంగా దాడి చేసినట్లు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు బాధిత చిన్నారి తండ్రి. హోస్తో చిన్నారిపై అతి కిరాతకంగా టీచర్ దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తమ చిన్నారి, టీచర్ కొట్టడంతో తీవ్రమైన నొప్పికి గురయ్యాడనీ, బాధతో విలవిల్లాడిన చిన్నారిని అడిగితే, విషయం వెల్లడించడం జరిగిందని బాధితుడి తండ్రి చెప్పారు. తమ చిన్నారిపై దాడికి సంబంధించి స్కూల్ ప్రిన్సిపాల్కి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు బాధిత చిన్నారి తండ్రి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కొట్టడమే కాకుండా, అసభ్యకరంగా చిన్నారిని టీచర్ తిట్టినట్లు ఫిర్యాదులో వివరించారు బాధిత చిన్నారి తండ్రి.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!