దుబాయ్‌లో గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ మెడిటేషన్‌ మాస్టర్‌ క్లాస్‌

- October 15, 2018 , by Maagulf

దుబాయ్‌:మానవతావాది, స్పిరిట్యువల్‌ లీడర్‌, శాంతి దూత గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రవచనాల్ని ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్‌ మంది అనుసరిస్తున్నారు. మిడిల్‌ ఈస్ట్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌ నిర్వహించనున్న కార్యక్రమంలో 6000 మంది పాల్గొననున్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, అలాగే ఐఎహెచ్‌వి ద్వారా మిడిల్‌ ఈస్ట్‌లో అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌, రెండు రోజులపాట మెడటేషన్‌ మాస్టర్‌ క్లాస్‌ని నిర్వహించబోతున్నట్లు ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ వెల్లడించారు. 'అన్‌వీలింగ్‌ ఇన్ఫినిటీ' పేరుతో ఈ కార్యక్రమాన్ని 16 మరియు 17 తేదీల్లో నిర్వహిస్తారు. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున ఔత్సాహికులు పాల్గొంటారు. సుమారు 6000 మంది పార్టిసిపెంట్లు ఈ మెడిషేన్‌ ఈవెంట్‌లో పాల్గొంటారనేది ఓ అంచనా. అన్‌వీలింగ్‌ ఇన్ఫినిటీలో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కి 1000, 3000 అరబ్‌ ఎమిరేట్‌ దినార్స్‌ ఫీజుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు www.gurudev.ae వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com