ధైర్యంగా మాట్లాడండీ:హీరో విశాల్

- October 16, 2018 , by Maagulf
ధైర్యంగా మాట్లాడండీ:హీరో విశాల్

దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘మీ టు’ ఉద్యమానికి నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శి , హీరో విశాల్ మద్దతు పలికారు. లైంగిక వేధింపులపై తనుశ్రీ దత్తా, సింగర్ చిన్మయి ల ఆరోపణలను గౌరవిస్తూ ట్వీట్ చేశారు విశాల్.. ‘ఇదే కరెక్ట్‌ టైమ్‌. సినీ రంగంలో మహిళలు ధైర్యంగా మాట్లాడండీ. మీకు నేను అండగా ఉంటా. భద్రత కల్పించడానికి ఓ కమిటీగా ఏర్పడతాం. లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయట పెట్టిన చిన్మయి, తనుశ్రీదత్తా తదితరులను గౌరవిస్తున్నా’ అని విశాల్‌ ట్వీట్‌ చేశారు. కాగా గతంలో నటి శ్రీరెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆమెకు సూచించాడు. కొన్ని రోజుల కిందట తన స్నేహితురాలు, నటి వరలక్ష్మి సైతం లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి దీనిపై పోరాడిందని అప్పట్లో విశాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com