గుమ్మడి గింజలు సేవిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?
- October 16, 2018గుమ్మడి గింజలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుటకు ఉపయోగపడుతాయి. మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. పురుషులకు శృంగార సామర్థ్యన్ని పెంచుతుంది.
గుమ్మడి గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ అల్సర్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. గుమ్మడి గింజలను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా వేడినీళ్లల్లో కలిపి కొద్దిగా ఉప్పు వేసుకుని తీసుకుంటే శరీర వేడి తగ్గుముఖం పడుతుంది.
తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గింజలతో తయారుచేసిన నూనె వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి వంటి సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. శరీరానికి కావలసిన మెగ్నిషియం గుమ్మడి గింజల్లో పుష్కలంగా లభిస్తుంది. అందువలన ప్రతిరోజూ ఈ గింజలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..