కొహ్లీ అభ్యర్థనను అంగీకరించిన బీసీసీఐ
- October 17, 2018ఢిల్లీ: టీమిండియా విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల భాగస్వాములను లేదా వారి ప్రియురాళ్లను అనుమతించాలని కొహ్లీ చేసిన అభ్యర్థనకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. దీర్ఘ కాలిక పర్యటనలు ఉన్న సమయంలో మొదటి పది రోజుల తర్వాత వెళ్లి పర్యటన ముగిసేవరకూ వారి భాగస్వాములు ఉండొచ్చని పాలకుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట తమ జీవిత భాగస్వాములు, వ్యక్తిగత సిబ్బందిని రెండు వారాలపాటే అనుమతిస్తున్నారు. అయితే ఈ నిబంధనలను మార్చాలని.. విదేశీ పర్యటన పూర్తికాలం జీవితభాగస్వాములను తమతో అనుమతించాలని ఇటీవల కోహ్లీ బీసీసీఐని అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనిపై ఆటగాళ్ల అభిప్రాయం తీసుకునేందుకు కోచ్ రవిశాస్త్రి, కొహ్లీ, రోహిత్ శర్మను పాలకుల కమిటీ వెస్టిండీస్తో రెండో టెస్టుకు ముందు కలిసి చర్చించింది. ఆటగాళ్ల వెంట జీవితభాగస్వాములను, ప్రియురాళ్లను అనుమతించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ