జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది

- October 17, 2018 , by Maagulf
జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది

సౌదీ అసమ్మతివాద జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది. టర్కీలోని సౌదీ కాన్సలేట్ లోపలికి వెళ్లినవాడు మళ్లీ అఖండంగా బయటకు రాలేదు. లోపలే చంపేశారని దాదాపుగా ఖరారైంది. ఖషోగ్గీ చేతికున్న యాపిల్ వాచ్ కాన్సలేట్ లోపల జరిగిన ఘోరమైన తతంగాన్ని రికార్డు చేసిందని అంటున్నారు. సౌదీ నుంచి ప్రత్యేక విమానాల్లో టర్కీకి వచ్చిన 15 మంది టీమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఓ పత్రిక తెలిపింది. ముందుగా ఖషోగ్గీ వేళ్లు నరికారు. అలా చిత్రవధలో భాగంగా పలు భాగాలను తెగ్గోసిన తర్వాత చివరకు తల నరికేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com