మహేశ్ మేనల్లుడి సినిమా 'అదేనువ్వు అదేనేను' ఆరంభం.!
- October 18, 2018అగ్ర కథానాయకుడు మహేశ్బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. గురువారం దసరా సందర్భంగా ఆయన మొదటి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి 'అదేనువ్వు అదేనేను' అనే టైటిల్ ఖరారు చేశారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో గుర్తింపు పొందిన నభా నటేష్ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. సుధీర్బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమాతో నభా నటేష్ నటిగా పరిచయం అయ్యారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఇది ఆమె రెండో చిత్రంగా రూపుదిద్దుకోనుంది.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..