మహేశ్‌ మేనల్లుడి సినిమా 'అదేనువ్వు అదేనేను' ఆరంభం.!

- October 18, 2018 , by Maagulf

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. గురువారం దసరా సందర్భంగా ఆయన మొదటి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్‌స్టార్‌ కృష్ణ క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రానికి 'అదేనువ్వు అదేనేను' అనే టైటిల్‌ ఖరారు చేశారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో గుర్తింపు పొందిన నభా నటేష్‌ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమాతో నభా నటేష్‌ నటిగా పరిచయం అయ్యారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఇది ఆమె రెండో చిత్రంగా రూపుదిద్దుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com