జీవితంలో చేయడనుకున్న పని చేసేసిన RGV
- October 19, 2018సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో చేయడనుకున్న పని చేసేశాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు డైరెక్టర్ రాంగోపాల్వర్మ. తాను నాస్తికుడిని అంటూనే…… వెంకన్నను దర్శించడం విశేషం. ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివరాలను చెప్పనున్నారు వర్మ. అసలు…. వివాదాల వర్మ బాలాజీ దర్శనానికి….. ఎందుకు వెళ్లాడనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. పబ్లిసిటీ కోసం వర్మ….. దేవుడిని కూడా వాడేసుకుంటున్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న కాణిపాకం దర్శించుకున్న ఆర్జీవీ ఇవాళ తిరుమల దర్శనం వెనుక…. పబ్లిసిటీ లెక్కలున్నట్లు తెలుస్తోంది.
దేవుడంటేనే ఆమడం దూరం ఉండే.. వర్మ …. దసరా వేళ అందర్నీ ఆశ్చర్యపర్చుతూ కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్నారు. సిబ్బంది ఆయనకు పూలమాలలు వేసి ఆహ్వానం పలకగా.. వర్మ పూజలు చేశారు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో వర్మ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు వినాయకుడి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతరం సాధారణ భక్తుల తరహాలోనే ఆలయంలో కలియతిరుగుతూ వర్మ దైవదర్శనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ