ఖషోగ్గి కౌన్సులేట్‌ లోనే చనిపోయారు : సౌదీ

- October 19, 2018 , by Maagulf
ఖషోగ్గి కౌన్సులేట్‌ లోనే చనిపోయారు : సౌదీ

సౌదీ అరేబియా:వివాదాస్పదంగా మారిన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి అదృశ్యం కేసులో సౌదీ అరేబియా ప్రభుత్వం పెదవి విప్పింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్యకార్యాలయంలోనే ఖషోగ్గి మరణించినట్లు వెల్లడించింది. కౌన్సులేట్‌లో జరిగిన ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ టీవీ వెల్లడించింది. ఈ ఘటనలో సౌదీకి చెందిన అయిదుగురు ఉన్నతాధికారులను తొలిగించారు. మరో 18 మందిని అరెస్టు చేసారు. అక్టోబర్ 2న సౌదీ కౌన్సులేట్‌కు వెళ్ళిన ఖషోగ్గి ఆ తర్వాత ఆయన ఆచూకీ చిక్కలేదు. అదృశ్యమైన ఖషోగ్గిని సౌదీని హత్య చేసినట్లు ఆరోపణలొచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com