మూడింటినీ కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..రాహుల్

- October 20, 2018 , by Maagulf
మూడింటినీ కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..రాహుల్

తెలంగాణలో రాహుల్‌ సమరభేరి మోగించారు. మొదట బైంసా, తరువాత కామారెడ్డి సభలతో కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్‌ నింపారు. ముఖ్యంగా కామారెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్‌.. కేసీఆర్‌, మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. ఇద్దరూ అవినీతిలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు.

నీళ్లు, నిధులు, నియామకాలపై నడిచిన ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పాటైందని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. కానీ ఆ మూడింటినీ కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. దాదాపు ఐదేళ్ల పాలనలో కేసీఆర్‌ అవినీతికి పాల్పడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మంటగలిపారని రాహుల్‌ మండిపడ్డారు.

ప్రాజెక్టుల రీ డిజైన్‌లో తీవ్ర అనివీతి జరిగిందని రాహుల్‌ విమర్శించారు. అంబేద్కర్‌ ప్రాణిహిత పేరు మార్చి ఆయనను అవమానించారన్నారు. కేవలం ప్రాజెక్టుల పేరు మార్చి.. కోట్లు కొల్లగొట్టారని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో రైతులది కీలక పాత్ర అని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం కోసం పోరాటం చేసిన రైతులకు కేసీఆర్‌ బేడీలు వేయించారని రాహుల్‌ మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com