ఆకాశంలో విందు.. ఆరగిస్తే ఆదమరచీ పోతారు..!
- October 21, 2018ఆకాశంలో.. 160 అడుగుల ఎత్తులో మనకు ఇష్టమైన విందు ఆరగిస్తూ ఉంటే.. అబ్బా.. ఆ రుచే వేరే.. ఇలా ఆలోచిస్తుంటే ఆదమరచీ కలకాలం అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది కదా..! అంత ఎత్తులో గాల్లో వేలాడుతూ అలాంటి థ్రిల్ను అనుభవించాలంటే మనం బెంగళూరు వెళ్లాల్సిందే. ‘జంపింగ్ ఇండియా అనే అడ్వేంచర్ స్పోర్ట్స్ కంపెనీ’ ఈ సాహోసోపేత ‘ఫ్లై డైనింగ్’ ఎక్స్పీయరెన్స్ని దేశంలో తొలిసారిగా బెంగళూరులో ప్రారంభించింది.
మాన్యతా టెక్ పార్క్లోని నాగవర లేక్ ఒడ్డున ఉన్న ఈ రెస్టారెంట్ 160 అడుగుల వరకు గాల్లో ఎగురుతుంది. 24 కుర్చీలు, పెద్ద డైనింగ్ టేబుల్తో ఉండే ఈ రెస్టారెంట్ను క్రేన్ ద్వారా పైకి లేపుతారు. అంతా ఎత్తు నుంచి పడిపోకుండా ఉండేందుకు మూడు సీట్ బెల్టులను అమర్చారు. ఇలా ఇండియాలో ఏర్పాటు చేసిన తొలి ఫ్లై డైనింగ్ రెస్టారెంట్ ఇదే కావటం విశేషం.
అయితే ఈ రెస్టారెంట్లోకి అందరిని అనుమతించారు. ఇందులోకి వెళ్లాలంటే కనీస ఎత్తు 4.5 అడుగులు ఉండాలి. బరువుతో సంబంధం లేదు.. ఎంతైనా ఉండవచ్చు. గర్భిణీలు, 14 ఏళ్ల లోపు చిన్నారులను ఈ రెస్టారెంట్లోకి అనుమతించరు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..