ఆకాశంలో విందు.. ఆరగిస్తే ఆదమరచీ పోతారు..!

- October 21, 2018 , by Maagulf
ఆకాశంలో విందు.. ఆరగిస్తే ఆదమరచీ పోతారు..!

ఆకాశంలో.. 160 అడుగుల ఎత్తులో మనకు ఇష్టమైన విందు ఆరగిస్తూ ఉంటే.. అబ్బా.. ఆ రుచే వేరే.. ఇలా ఆలోచిస్తుంటే ఆదమరచీ కలకాలం అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది కదా..! అంత ఎత్తులో గాల్లో వేలాడుతూ అలాంటి థ్రిల్‌ను అనుభవించాలంటే మనం బెంగళూరు వెళ్లాల్సిందే. ‘జంపింగ్‌ ఇండియా అనే అడ్వేంచర్‌ స్పోర్ట్స్‌ కంపెనీ’ ఈ సాహోసోపేత ‘ఫ్లై డైనింగ్‌’ ఎక్స్‌పీయరెన్స్‌ని దేశంలో తొలిసారిగా బెంగళూరులో ప్రారంభించింది.  

మాన్యతా టెక్‌ పార్క్‌లోని నాగవర లేక్‌ ఒడ్డున ఉన్న ఈ రెస్టారెంట్‌ 160 అడుగుల వరకు గాల్లో ఎగురుతుంది. 24 కుర్చీలు, పెద్ద డైనింగ్‌ టేబుల్‌తో ఉండే ఈ రెస్టారెంట్‌ను క్రేన్‌ ద్వారా పైకి లేపుతారు. అంతా ఎత్తు నుంచి పడిపోకుండా ఉండేందుకు మూడు సీట్‌ బెల్టులను అమర్చారు. ఇలా ఇండియాలో ఏర్పాటు చేసిన తొలి ఫ్లై డైనింగ్‌ రెస్టారెంట్‌ ఇదే కావటం విశేషం.

అయితే ఈ రెస్టారెంట్‌లోకి అందరిని అనుమతించారు. ఇందులోకి వెళ్లాలంటే కనీస ఎత్తు 4.5 అడుగులు ఉండాలి. బరువుతో సంబంధం లేదు.. ఎంతైనా ఉండవచ్చు. గర్భిణీలు, 14 ఏళ్ల లోపు చిన్నారులను ఈ రెస్టారెంట్‌లోకి అనుమతించరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com