ఇటలీలో భీకర తుఫాన్
- November 04, 2018మిలాన్/రోమ్: ఇటలీలో సంభవించిన భీకర తుఫాన్ వల్ల భారీగా వర్షాలు కురిసి వరద పెరుగడంతో 17 మంది మరణించారు. దాదాపు 1.4 కోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. ఈదురుగాలులు గంటకు 180 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. చెట్లు విరిగి మీద పడటంతోనే ఎక్కువ మంది మరణించారు. సిసిలీ, ట్రెన్టినో, వెనిటో రాష్ర్టాలను తుఫాన్ కుదిపేసింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. అధికారులు మాట్లాడుతూ తుఫాన్ ధాటికి భారీగా విధ్వంసం జరిగిందని, తిరిగి కోలుకోవడానికి దాదాపు 100 ఏండ్లు పట్టవచ్చని చెప్పారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారని తెలిపారు. వరద పెరుగడంతో పాఠశాలలను మూసివేశామని పేర్కొన్నారు. తుఫాన్ ప్రధానంగా ఇటలీ ఉత్తర ప్రాంతం, వెనిస్ చుట్టుపక్కల ప్రభావం చూపిందని, దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ