ఓటరు నమోదుకు ఇక ఐదు రోజులే గడువు
- November 05, 2018తెలంగాణ:ఓటరు నమోదుకు ఇంకా ఐదు రోజులే మాత్రమే గడువు ఉంది. నవంబర్ 9వ తేదీన ఓటరు నమోదుకు చివరి తేదీగా ప్రకటించారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఒక వేళ ఓటరుగా నమోదు కాకుంటే వెంటనే సమీపంలోని వార్డు కార్యాలయం, గ్రామ పంచాయితీ, బూత్లెవల్ ఆఫీసర్ వద్ద ఫారం-6ని తీసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ ఎన్నికలలో ఓటు వేయాలంటే ఈ నెల 9వ తేదీలోపు ఓటరుగా నమోదై ఉండాలి. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని డిసెంబర్ 7న జరిగే ఓటింగ్లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు సూచించారు. కార్డు ఉన్నప్పటికీ తుది జాబితాలో ఓటులేని వ్యక్తులు కూడా ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష