రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ళ మహిళ మృతి
- November 05, 2018షార్జా:కుమార్తెను ట్రాలర్లో వేసుకుని వెళుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, 16 నెలల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలో ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరగగా, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డ చిన్నారిని, ఆమె తల్లిని వెంటనే అల్ కాసిమి ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో ఆ మహిళ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రోడ్ క్రాసింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాంతంలో రోడ్ క్రాస్ చేయడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అతి వేగం కూడా కారణమని వారు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ