ఆఫ్రికా లో 78 మంది విద్యార్థుల కిడ్నాప్‌

- November 05, 2018 , by Maagulf
ఆఫ్రికా లో 78 మంది విద్యార్థుల కిడ్నాప్‌

 ఆఫ్రికా:ఆఫ్రికా దేశం కెమరూన్‌లో 78 మంది స్కూల్ విద్యార్థులు అపహరణకు గురయ్యారు. ఈ ఘటన బమెండాలో జరిగింది. కిడ్నాప్‌కు గురైనవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. బమెండా ప్రాంతంలో వేర్పాటు ఉద్యమం కొనసాగుతున్నది. ప్రెసిడెంట్ పౌల్ బియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వేర్పాటువాదులు భారీ నిరసనలు చేపట్టారు. స్కూళ్లు మూసివేశారు, కర్ఫ్యూ విధించారు. కిడ్నాప్‌కు గురైన వారిలో స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com