ఛారిటీ మారథాన్‌: 3 వేల మందికి పైగా హాజరు

- November 05, 2018 , by Maagulf
ఛారిటీ మారథాన్‌: 3 వేల మందికి పైగా హాజరు

బహ్రెయిన్:యాన్యువల్‌ బహ్రెయిన్‌ మారథాన్‌ రిలేలో 3 వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనన్నారు. కింగ్‌డమ్‌లో చారిటబుల్‌ సొసైటీలకు నిధులు సమకూర్చేందుకుగాను ఈ మారథాన్‌ జరగనుంది. సేవా కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన, ఆసక్తి వుందో ఈ చారిటీ మారథాన్స్‌తో నిరూపితమవుతోందని నిర్వాహకులు తెలిపారు. 37వ ఎడిషన్‌ బహ్రెయిన్‌ మారథాన్‌ రిలే (బిఎంఆర్‌), బహ్రెయిన్‌ రౌండ్‌ టేబుల్‌ మరియు రొటరాక్ట్‌ బహ్రెయిన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నవంబర్‌ 9న బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ వద్ద ఈ మారథాన్‌ జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com