ఎన్ ఎస్ జి కమాండర్ గా ఆది..
- November 08, 2018ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. 'ఆపరేషన్ గోల్డ్ఫిష్' రూపొందే ఈ మూవీకి 'వినాయకుడు' ఫేమ్ అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్టెల్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా పాపులర్ అయిన సాషా ఛెత్రి ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. పోస్టర్లో ఎన్ ఎస్ జీ కమాండోగా ఆది సాయికుమార్ లుక్ కొత్తగా ఉంది.. ఈ చిత్రంలో ఎన్ ఎస్ జి కమాండో అర్జున్ పండిట్గా ఆది కనిపిస్తారు. నిత్య నరేష్, కార్తీక్ రాజు, పార్వతీశం, అబ్బూరి రవి, క్రిష్ణుడు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషించారు. వినాయకుడు టాకీస్ బ్యానర్పై ప్రతిభ అడివి, కట్ట ఆశీష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీశ్ డేగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
. గూఢచారి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఊపిరి, క్షణం, కేరింత, ఎవడు వంటి చాలా చిత్రాలకు మాటలు సమకూర్చిన అబ్బూరి రవి ఈ మూవీ ద్వారా నటుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్