పాలకొల్లులో దాసరి విగ్రహావిష్కరణ

- November 08, 2018 , by Maagulf
పాలకొల్లులో దాసరి విగ్రహావిష్కరణ

పశ్చిమ గోదావరి : తెలుగు చిత్ర పరిశ్రమలో 150 చిత్రాలకు పైగా డైరెక్షన్‌ చేసిన డాక్టర్‌ దాసరి నారాయణరావు విగ్రహాన్ని శుక్రవారం పాలకొల్లులో ఆవిష్కరించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. గిన్నిస్‌బుక్‌ లో స్థానం సంపాదించిన దాసరి విగ్రహం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎల్‌సి మేకా శేషు బాబు, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com