ఛారిటీ రన్‌లో 3 వేల మంది..

- November 10, 2018 , by Maagulf
ఛారిటీ రన్‌లో 3 వేల మంది..

బహ్రెయిన్:పలు రకాల ఛారిటీ ప్రోగ్రామ్స్‌ కోసం 50,000 బహ్రెయినీ దినార్స్‌ సేకరించేందుకుగాను నిర్వహించిన మారథాన్‌లో 3 వేల మంది రన్నర్స్‌, 200 టీమ్‌లుగా పార్టిసిపేట్‌ చేశారు. 37వ ఎడిషన్‌ బహ్రెయిన్‌ మారథాన్‌ రిలే, బహ్రెయిన్‌ రౌండ్‌ టేబుల్‌ మరియు రోటరాక్ట్‌ బహ్రెయిన్‌ నిర్వహణలో జరిగింది. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ వద్ద ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. బిఎంఆర్‌ 2018 ఆర్గనైజింగ్‌ కమిటీ మెంబర్‌ హిషాంగ్‌ కెవల్రామ్‌ మాట్లాడుతూ, బహ్రెయిన్‌ మారథాన్‌ రిలేలో పెద్ద యెత్తున పార్టిసిపెంట్స్‌ పాల్గొన్నారని తెలిపారు. తాజా ఈవెంట్‌ బహ్రెయిన్‌లోనే అతి పెద్ద ఛారిటీ ఈవెంట్‌గా రికార్డులకెక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్‌ ద్వారా మొత్తంగా 50,000 బహ్రెయినీ దినార్స్‌ నిధుల్ని సమీకరించారు. పలు రకాలైనా సేవా కార్యక్రమాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com