దుబాయ్ చేరుకున్న కొత్త మెట్రో రైళ్ళు
- November 10, 2018దుబాయ్:కొత్త మెట్రో రైళ్ళకు సంబంధించి తొలి దఫాలో 50 రైళ్ళు దుబాయ్ చేరుకున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ రైళ్ళను రషిదియా మెట్రో డిపోకి తరలించారు. 2019 అక్టోబర్ నాటికి మొత్తం రైళ్ళన్నీ దుబాయ్కి చేరుకుంటాయని ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు. రెడ్ లైన్ రూట్ 2020లో త్వరలో ఈ రైళ్ళను పరీక్షించబోతఱున్నారు. ప్రస్తుతం 643 మంది ప్రయాణీకులకు వీలుగా రైళ్ళ డిజైన్లు వుండగా, కొత్త రైళ్ళలో 696 మంది ప్రయాణీకులకు వీలుంటుంది. ఎక్స్టీరియర్ డిజైన్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. కొత్త ట్రైన్లలో చివరి క్యారేజ్ మహిళలు, పిల్లల కోసం వినియోగిస్తారు. ఫస్ట్ క్యారేజ్ గోల్డ్ క్లాస్లో వుంటుంది. మిగతా క్యారేజెస్ అన్నీ సిల్వర్ క్లాస్గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు