ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతం
- November 14, 2018ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతమైంది. సమాచార వ్యవస్థకు ఊతమిచ్చే జీశాట్-29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ రోదసిలోకి తీసుకువెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. శ్రీహరికోట షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెట్ను నింగిలోకి పంపారు శాస్త్ర వేత్తలు. 16.43 నిమిషాలలో భూమికి 207కి.మీ. ఎత్తుకు చేరుకుని జీశాట్-29 ఉపగ్రహాన్ని వదిలిపెట్టింది రాకెట్. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా ఈ ఉపగ్రహం.. జమ్ము-కశ్మీర్, ఉత్తర, ఈశాన్య భారత భూ భాగాలలో సేవలు అందించనుంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ ప్రసారాలకు ఊతం ఇస్తుంది. మొత్తం పదేళ్లపాటు ఈ ఉపగ్రహం పనిచేసేలా రూపొందించారు శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్, అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందించాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?
- సౌదీకి 'A/A-1' క్రెడిట్ రేటింగ్.. ఎస్ అండ్ పీ
- 2.6 శాతం పెరిగిన కువైట్ జనాభా
- బహ్రెయిన్లో ప్రైవేట్ యూనివర్సిటీ పై స్టూడెంట్ దావా
- ఒమానీ ఫలాజ్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్లు..యునెస్కో
- ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
- దుబాయ్ కొత్త లోగోను ఆవిష్కరించిన క్రౌన్ ప్రిన్స్
- ప్రతి మహిళ శక్తి రూపంలో కన్పిస్తుంది: ప్రధాని మోడీ