ప్రత్యేక దేశం కావాలంటున్న అఫ్రిది
- November 14, 2018మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తన నోటికి పనిచెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటాడు. తాజాగా అఫ్రీది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ పార్లమెంట్ లో విద్యార్ధులతో ముచ్చటించిన అఫ్రీది..కశ్మీర్ ను వదిలేయండి. నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేని మీకు కశ్మీర్ ఎందుకు. ఉన్న దేశంలో శాంతిభద్రతల్ని కాపాడాలంటూ పాక్ ప్రభుత్వానికి హితువు పలికాడు.
అంతేకాదు కశ్మీర్ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని, లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతగానో బాధిస్తోందని అఫ్రిది అన్నాడు. పాకిస్థాన్కు కశ్మీర్ అవసరం లేదు. అలాగని ఇండియాకు కూడా దానిని ఇవ్వొద్దు. కశ్మీర్ ప్రత్యేక దేశం కావాలి. అఫ్రీది చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పలువురు నెటిజన్లు అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. సొంత దేశంపై విమర్శలు చేస్తున్న అఫ్రీది ఇలా మాట్లాడే అర్హత లేదని అంటున్నారు నెటిజన్లు.
తాజా వార్తలు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?
- సౌదీకి 'A/A-1' క్రెడిట్ రేటింగ్.. ఎస్ అండ్ పీ
- 2.6 శాతం పెరిగిన కువైట్ జనాభా
- బహ్రెయిన్లో ప్రైవేట్ యూనివర్సిటీ పై స్టూడెంట్ దావా