ప్రభుత్వ ఎయిర్లైన్సకు బెయిల్ఔట్ ప్యాకేజి - పాకిస్తాన్
- November 14, 2018ఇస్లామాబాద్: నగదు సంక్షోభంలో కూరుకునిపోయిన పాకిస్తాన్ప్రభుత్వం ఆదేశంలోని అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొనేందుకుగాను రూ.1700 కోట్ల బెయిల్ఔట్ ప్యాకేజిని ఆమోదించింది. ప్రభుత్వం ముందురోజే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు వచ్చే రెండునెలల్లో ఈ ప్యాకేజిని అందించడం దావరా నష్టాలనుంచి బైటపేందుకు నిర్ణయించింది. ప్రధానిగా ఇమ్రాన్ఖాన్ ప్రమాణస్వీకారంచేసిన తర్వాత ఇదేమొదటినిర్ణయంగా చెపుతున్నారు. పౌరవిమానయాన రంగానికి ఇమ్రాన్ఖాన్ ఇన్చార్జిగా ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఆర్ధికసంక్షోభం ఎదుర్కొంటున్నది. ఎనిమిది బిలియన్ డాలర్లను ప్యాకేజిని ఐఎఎంఫ్ను కోరింది. దేశంలో తలెత్తినచెల్లింపుల సంక్షోభాన్ని అధిగమించేందుకు ఐఎంఎఫ్ ప్యాకేజి ఒక్కటే శరణ్యమని తెలుస్తోంది. ఆర్ధిక సమన్వయ కమిటీ ప్రకారంచూస్తే ఆర్ధిక మంత్రి అతద్ ఉమార్ సోమవారం 1720 కోట్ల ప్యాకేజిని ప్రకటించారు. పిటిఐ ప్రభుత్వం ఇపుడు గత ప్రభుత్వం అంటే నవాజ్షరీఫ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నదని ఇలాంటి బెయిల్ఔట్ప్యాకేజిల ద్వారానే ఐదేళ్లనుంచి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కొనసాగేటట్లు చేస్తోంది. ఇపుడు ఎయిర్లైన్స్ ప్యాకేజిని వాణిజ్యబ్యాంకులనుంచి సమకూరుస్తుంది.
ఇందుకు ఆర్ధికశాఖ హామీనిస్తుంది. ఇసిసి గ్యారంటీ పరిమితిని రూ.21.2 కోట్లకు పెంచిందని ఆర్ధికశాఖ అధికారులు ప్రకటించారు. ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ ఎయిర్మార్షల్ అర్షద్మాలిక్ను సిఇఒగా నియమించారు. అయితే మాలిక్ అనుభవంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక వాణిజ్య విమాన సంస్థను నిర్వహించడం అంటే సుదీర్ఘ అనుభవం ఉండాలని తేల్చారు. అదనంగా 19.5 కోట్ల సావరిన్ గ్యారంటీలు ఆర్ధిక మంత్రిత్వశాఖ ఇప్పటివరకూ 4.08 కోట్లు చేకూర్పును అందించింది. తాజా పెట్టుబడులతో మొత్తం బెయిల్ఔట్ ప్యాకేజి 25.3 కోట్ల రూపాయలకు చేరింది. అధికారంలోనికి వచ్చినవెంటనే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్సంస్థనుప్రైవేటీకరించకుండా బెయిల్ ఔట్ప్యాకేజితో ఆదుకునే యత్నాలుచేస్తోంది. ఎయిర్లైన్స్ ఏళ్లతరబడి నష్టాల్లో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?
- సౌదీకి 'A/A-1' క్రెడిట్ రేటింగ్.. ఎస్ అండ్ పీ
- 2.6 శాతం పెరిగిన కువైట్ జనాభా
- బహ్రెయిన్లో ప్రైవేట్ యూనివర్సిటీ పై స్టూడెంట్ దావా
- ఒమానీ ఫలాజ్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్లు..యునెస్కో
- ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
- దుబాయ్ కొత్త లోగోను ఆవిష్కరించిన క్రౌన్ ప్రిన్స్
- ప్రతి మహిళ శక్తి రూపంలో కన్పిస్తుంది: ప్రధాని మోడీ