పెళ్లికి ఇన్సూరెన్స్ చేయించిన దీపికా, రణ్వీర్
- November 15, 2018ఢిల్లీ : ఎవరైనా వారి జీవితాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తారు..కానీ బాలీవుడ్ ప్రేమజంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ వివాహానికి ఇన్సూరెన్స్ చేయించారు. ఢిల్లీకి చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో వీరిద్దరూ తమ పెళ్లికి ఇన్సూరెన్స్ చేయించారట. 'దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ భవ్నానీ' పేరిట దీప్వీర్ వివాహానికి బీమా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా వివాహం సందర్భంగా వీరికి అందించారు. వివాహంలో ప్రమాదవశాత్తూ ఆస్తి నష్టం, దొంగతనం, పేలుడు, అగ్ని ప్రమాదం, ఎయిర్ క్రాప్ట్ ప్రమాదం, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది' అని ఈ సంస్థ వెల్లడించింది. ఇటలీలోని లేక్ కోమోలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణెల వివాహం కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది. అయితే వివాహ వేడుకలో సెల్ఫోన్లను నిషేధించారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్