మరో 25 ఏళ్లుల్లో మార్స్ మీదకు మనిషి..
- November 15, 2018హూస్టన్: మార్స్ గ్రహం మీదకు మనుషులను పంపేందుకు నాసా అనేక ప్రయోగాలు నిర్వహిస్తున్నది. అయితే మరో 25 ఏండ్లల్లో అరుణ గ్రహంపై మనుషులు కాలు మోపే అవకాశాలు ఉన్నట్లు నాసా వెల్లడించింది. అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించే టెక్నాలజీ అభివృద్ధిని చేయాల్సి ఉందని నాసా తెలిపింది. మార్స్ గ్రహం భూమి నుంచి 14 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నది. అయితే చంద్రుడిపై అపోల్ వ్యోమనౌకను పంపినప్పుడు ఎన్ని ఇబ్బందులో ఎదురయ్యాయో అంత కన్నా ఎక్కువే ఇబ్బందులు ఉంటాయని నాసా పేర్కొన్నది. మార్స్ గ్రహం వెళ్లేందుకు కనీసం 9 నెలల ప్రయాణం ఉంటుందని, అయితే ఆ సమయంలో సౌర కాంతి నుంచి రేడియేషన్ ఉంటుందని, దానికి తగ్గట్లుగా షీల్డ్లను తయారు చేయాల్సి ఉంటుందని నాసా అభిప్రాయపడింది. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తే, మార్స్ మిషన్ నిజం కావాలంటే కనీసం 25 ఏళ్ల సమయం పడుతుందని మాజీ ఆస్ట్రోనాట్ టామ్ జోన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సిబ్బంది
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ