కువైట్లో వర్షాలు: యూఏఈ నుంచి విమానాల రద్దు
- November 15, 2018యూఏఈకి చెందిన అన్ని ఎయిర్ లైన్స్, తమ విమానాల్ని కువైట్కి వెళ్ళకుండా నిలువరించాయి. కువైట్లో వున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిజిసిఎ పేర్కొంది. కువైట్లో భారీ వర్షాలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. విమానాశ్రయాల్లోనూ వరద నీరు పోటెత్తుతోంది. దుబాయ్, అబుదాబీ సహా అనేక విమానాశ్రయాలనుంచి విమానాల్ని కువైట్కి నిలిపివేశారు. కువైట్లో స్కూళ్ళు సైతం మూతపడ్డాయి. గత ఐదు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. మరోపక్క కువైట్లో యూఏఈ ఎంబసీ, తమ పౌరుల్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్ళరాదని పౌరుల్ని హెచ్చరించింది. కాగా, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్, తమ కంపెనీల్లో వర్క్ని తాత్కాలికంగా నిలిపివేసింది. కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ కూడా వర్క్ని నిలిపివేయడం గమనార్హం. అనూహ్యంగా చోటు చేసుకున్న వరదలతో కువైట్లో పరిస్థితులు బీతావహంగా మారాయి.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం