మన హీరోలేరబ్బా?

- November 15, 2018 , by Maagulf

తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ ఇండస్ట్రీలకు చెందిన 1980 తరం హీరోలు - హీరోయిన్స్ ప్రతి ఏడాది రీ యూనియన్ ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు రీ యూనియన్ అయిన వీరు తాజాగా 9వ సారి గెట్ టు గెదర్ అయ్యారు. లాస్ట్ టైం విదేశాల్లో వీరంతా సరదాగా గడిపారు. ఈసారి మాత్రం చెన్నైలోని టీ నగర్ లోని ఒక రెసిడెన్సీలో ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే, ఈసారి తెలుగు సినీ తారల సందడి కనిపించలేదు. చెన్నైలో జరిగిన రీ యూనియన్ లో కేవలం 22 మంది స్టార్స్ మాత్రమే పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ నుండి చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ లు డుమ్మా కొట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com