బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న కేటీఆర్
- November 17, 2018ముంబై: రాష్ట్ర సీఎం కేసీఆర్ను ఎకనామిక్ టైమ్స్ వారి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఎకనామిక్ టైమ్స్ అవార్డుల ప్రదానోత్సవం ముంబైలో జరిగింది. సీఎం కేసీఆర్కు వచ్చిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సీఎం కేసీఆర్ తరుపున మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును మంత్రి కేటీఆర్కు అందించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశంలో అత్యంత పిన్న వయసు గల తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులతో దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ అవార్డు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా మంత్రి అభివర్ణించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ