బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న కేటీఆర్

- November 17, 2018 , by Maagulf
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న కేటీఆర్

ముంబై: రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను ఎకనామిక్ టైమ్స్ వారి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఎకనామిక్ టైమ్స్ అవార్డుల ప్రదానోత్సవం ముంబైలో జరిగింది. సీఎం కేసీఆర్‌కు వచ్చిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సీఎం కేసీఆర్ తరుపున మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశంలో అత్యంత పిన్న వయసు గల తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులతో దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ అవార్డు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా మంత్రి అభివర్ణించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com