జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌...ఇద్దరు ఉగ్రవాదుల మృతి.!

- November 18, 2018 , by Maagulf
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌...ఇద్దరు ఉగ్రవాదుల మృతి.!

జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా రెబ్బాన్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఉగ్ర కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఆదివారం తెల్లవారు జామున నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడంతో తిరిగి ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. వారి నుంచి తుపాకీలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com