అమెరికాలో కాల్పులు, తెలంగాణ వ్యక్తి మృతి
- November 18, 2018అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. వెంట్నార్ సిటీలో నివసిస్తున్న మెదక్కు చెందిన సునీల్ ఎడ్లాను అతని ఇంటి ముందు గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపేశాడు.
ఆఫీసు అయ్యాక సునీల్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బాలుడు అతనిపై కాల్పులు జరిపాడు. ఆ బాలుడు సునీల్ వచ్చే వరకు వేచి చూసి, రాగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సునీల్ వయస్సు 61. కాల్పుల అనంతరం సునీల్ కారును తీసుకొని అతను పారిపోయాడు. సునీల్ తన తల్లి 95వ పుట్టిన రోజు వేడుకల కోసం మెదక్లోని సొంత ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సునీల్ తలపై కాల్చడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సునీల్ కారులో ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా జాడ తెలుసుకుని బాలుడిని అరెస్ట్ చేశారు. సునీల్ను ఎందుకు హత్య చేశారనే విషయం తెలియరాలేదు. పోలీసులు కాల్పులు జరిపిన బాలుడిని విచారిస్తున్నారు. మైనర్ కావడంతో అతడి పేరును బయటకు రానీయడం లేదు. సునీల్ 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. సునీల్కు మెదక్, పశ్చిమ గోదావరి జిల్లాలలో బంధువులు ఉన్నారు
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్