విజయవాడ నుంచి సింగపూర్ ఎగిరిపోవచ్చు
- November 20, 2018ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది శుభవార్తే. సింగపూర్ వెళ్లాలనుకునే వారు ఇకపై హైదరాబాద్కో, చెన్నైకో వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పుడు నేరుగా విజయవాడ నుంచి సింగపూర్ ఎగిరిపోవచ్చు. ఈ మేరకు బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో అంతర్జాతీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇండిగో ఎయిర్లైన్స్తో రాష్ట్ర ఇంధన, మౌలిక సదుపాయలు, సీఆర్డీఏ చేసుకున్న అవగాహనా ఒప్పందంలో భాగంగా సింగపూర్కు నేరుగా విమానాలు నడపనుంది. డిసెంబరు 4 నుంచి విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఇండిగో ఆహ్వానించింది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్