భారత సంతతి మహిళలకు అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డులు

- November 20, 2018 , by Maagulf
భారత సంతతి మహిళలకు అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డులు

ఎనిమిది మంది భారత సంతతి మహిళలకు అమెరికా అత్యున్నత పురస్కారాలు లభించాయి. రాజకీయాలు, వ్యాపారం, మానవ హక్కులు, ఖగోళ భౌతిక శాస్త్రం తదితర రంగాల్లో వారు అందించిన సేవలకు గాను ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి పురస్కారాలతో వారిని సత్కరించింది. ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాది షీలా మూర్తి, ఏషియన్‌ అమెరికన్‌ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌(ఏఏహెచ్‌ఓఏ) వైస్‌ ఛైర్‌పర్సన్‌ జాగృతి పన్‌వాలా, డెమోక్రటిక్‌ పార్టీ ఫండ్‌రైజర్‌ అండ్‌ ఆర్ట్‌ కలెక్టర్‌ మహీందర్‌ టక్‌, నాసా ఆస్ట్రో ఫిజిస్ట్‌ మధులిక గుహతకుర్తా తదితర మహిళలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com