యూఏఈలో గురుదేవ్ రవిశంకర్ 'హ్యాపీనెస్ ఈవెంట్స్'
- November 20, 2018యూ.ఏ.ఈ:హ్యుమానిటేరియన్ లీడర్, వరల్డ్ టోలరెన్స్ డే సందర్భంగా, శాంతి ప్రవచనాల్ని అందించారు. నాలుగు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఇచ్చిన సందేశం, అలాగే మెడిటేషన్ గురించి ఆయన చేసిన ప్రసంగాలు చాలామందిని ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి. ఫుజారియా గవర్నమెంట్ ఆహ్వానం మేరకు రవిశంకర్, ఈ పర్యటన చేపట్టారు. మైండ్ ఎక్స్పాన్షన్కి సంబంధించి అద్భుతమైన టెక్నాలజీగా మెడిటేషన్ని అభివర్ణించారు శ్రీశ్రీ రవిశంకర్. మనుషుల్లోని పాజిటివిటీని పెంచడమే మెడిటేషన్ లక్ష్యమని ఆయన చెప్పారు. చర్చలు, వర్క్ షాప్లను యూఏఈలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తూ, ఆర్ట్ ఆఫ్ డి స్ట్రెస్సింగ్పై అవగాహన కల్పించారు. ఫుజారియా, షార్జా, దుబాయ్లలో రవిశంకర్ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నేషనాలిటీస్కి అతీతంగా, బ్యాక్గ్రౌండ్స్కి అతీతంగా పలువురు పాల్గొని, రవిశంకర్ ప్రసంగాల పట్ల ఆకర్షితులయ్యారు. శ్రీశ్రీ రవిశంకర్, 156కి పైగా దేశాల్లో 360 మిలియన్లకు పైగా ప్రజలతో మమేకం అయి, తన సందేశాల్ని వారికి అందించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!