దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకున్న భారతీయ వలసదారుడు
- November 20, 2018దుబాయ్కి చెందిన భారతీయ వలసదారుడు నౌషద్ సుబిర్, తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ విజేతగా నిలిచారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో భాగంగా టిక్కెట్ 0520 టిక్కెట్ సిరీస్ 286 ఈ బహుమతిని నౌషద్ సుబీర్కి అందించింది. ఆన్లైన్లో సుబీర్ ఈ టిక్కెట్ని కొనుగోలు చేశారు. తాను పనిచేస్తున్న రెడా గ్రూప్కి చెందిన మరో తొమ్మిది మందితో కలిసి ఈ టిక్కెట్ ధరని షేర్ చేసుకున్నారు సుబీర్. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకోవడంపై సుబీర్ మాట్లాడుతూ, ఈ గెలుపుతో తామంతా లక్కీ అని ప్రూవ్ అయ్యిందని చెప్పారు. దుబాయ్లో 20 ఏళ్ళుగా సుబీర్ నివసిస్తున్నారు. ఈ రాఫెల్ గెల్చుకోవడం ద్వారా సుబీర్ ఈ ఘనతను సాధించిన 137వ ఇండియన్గా రికార్డులకెక్కారు. ఇండియాకే చెందిన పర్వీన్ షేక్ ఆసిఫ్ అనే 43 ఏళ్ళ వ్యక్తికి బిఎండ్బ్యుల ఆర్ 1200 ఆర్ మోటార్ బైక్ ఈ రాఫెల్లో దక్కింది.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం