సముద్రగర్భంలో హైస్పీడ్ రైళ్లు ... చైనాలో తొలిసారి
- November 23, 2018బీజింగ్: ఎన్నో అద్భుతాలకు వేదికైన చైనాలో తొలిసారి సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించబోతున్నారు. హైస్పీడ్ రైళ్ల కోసం ఈ టన్నెల్ను ఉపయోగించనున్నారు. తూర్పు ప్రావిన్స్ ఝెజియాంగ్లోని రెండు నగరాలను ఇది కలపనుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నర ప్రయాణ సమయం.. 30 నిమిషాలకు పరిమితం కానుంది. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ మొత్తం పొడవు 70.92 కిలోమీటర్లు కాగా.. అందులో 16.2 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్నారు. ఝెజియాంగ్ ప్రావిన్స్లోని నింగ్బో నగరాన్ని ద్వీప నగరమైన ఝౌషాన్తో కలపనుంది.
ఈ మార్గంలో హైస్పీడ్ రైలు గంటకు గరిష్ఠంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కొత్త ప్రాజెక్ట్తో చైనాలో మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గం పొడవు 25 వేల కిలోమీటర్లకు చేరింది. ప్రపచంలోని మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గంలో 60 శాతం చైనాలోనే ఉండటం విశేషం. చైనాలోనూ ఈ ఝెజియాంగ్ ప్రావిన్స్లోనే తొలిసారి హైస్పీడ్ రైలు మార్గాన్ని లాంచ్ చేశారు. చైనా అభివృద్ధిలో ఈ హైస్పీడ్ రైళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బీజింగ్-షాంఘైలాంటి రూట్లలో గంటలకు గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్లు ఉండటం విశేషం.
ఇండియాలోనూ ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ రైలు కోసం సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం