అమెరికాను హెచ్చరించిన వాతావరణ శాఖ
- November 28, 2018మధ్య అమెరికాను మంచుతుఫాన్ వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈశాన్య మిస్సోరి, మిచిగాన్, చికాగో ప్రాంతాల్లో భారీగా మంచు పడుతుండటంతో జనజీవనం స్థంభించింది. దీంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వాణిజ్య, వ్యాపార, కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి.
ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మంచుతోపాటు భీకరమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో ధ్యాంక్ గివింగ్ హాలిడే సందర్బంగా బయటకు రాకుండా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో చికాగోలో 13 అంగులాల మంచు కురిసిందని అధికారులు తెలిపారు. 3లక్షల 40వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రోడ్లపై పెద్ద ఎత్తున మంచు కూరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగిస్తూ రాకపోకను పునరుద్ధరిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
కేన్సస్ మిస్సోరి, నెబ్రస్కాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల ఆరు నుంచి 10 అంగుళాల మందంలో మంచు కురిసింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. 16 వందల విమాన సర్వీసులు రద్దు కాగా, 15 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. షికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అత్యధికంగా 770 విమానాలు, కేన్సస్ సిటీ నుంచి 187, షికాగో మిడ్వే నుంచి 124 విమానాలు రద్దయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..