మన ముందుకు వస్తున్న 'ఆక్వామేన్'
- December 06, 2018మల్టీప్లెక్స్ ట్రెండ్ పెరిగిన తర్వాత త్రీడి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు ఆడియెన్స్. ఇటీవల విడుదలైన '2.ఓ' త్రీడిలో ఆకట్టుకుంటోంది. తాజాగా హాలీవుడ్ మూవీ 'ఆక్వామేన్' త్రీడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
త్రీడిలో '2.ఓ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, ఎన్.వి.ప్రసాద్, యు.వి.క్రియేషన్స్ వంశీ.. తమ 'ఎన్.వి.ఆర్' సంస్థ ద్వారా మరో త్రీడి సినిమా 'ఆక్వామేన్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డి.సి. కామిక్స్ క్యారెక్టర్ 'ఆక్వామేన్' పేరుతో తెరకెక్కిన ఈ హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. ఈ చిత్రం అమెరికాలో ఈనెల 21న విడుదలవుతుంటే ఇండియాలో ఒక వారం ముందుగా ఈనెల 14నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ ఏడాది విడుదలైన 'బ్లాంక్ ఫాంథర్', 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', 'జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్ డమ్', 'మిషన్ ఇంపాజిబుల్ - ఫాలౌట్' వంటి హాలీవుడ్ చిత్రాలు.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాయి. ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనువాద రూపంలో విడుదలై ఇక్కడ స్ట్రెయిట్ సినిమాలకు దీటుగా కలెక్షన్లను సాధించాయి. ఈనేపథ్యంలో ఈ ఏడాది చివరి హాలీవుడ్ బడా మూవీగా రాబోతున్న 'ఆక్వామేన్'పై అంతటా ఆసక్తి నెలకొంది. 160 మిలియన్ డాలర్ల బడ్జెట్తో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' ఫేమ్ జేమ్స్వేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జేసన్ మమోవా టైటిల్ రోల్లో కనిపించబోతున్నాడు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో అలరించబోయే 'ఆక్వామేన్' తెలుగులో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ