అమరావతి:హ్యాపీనెస్ట్ ఫ్లాట్స్ బుకింగ్స్
- December 10, 2018అమరావతిలో ప్రజలకోసం నిర్మించే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్లో రెండో దశ బుకింగ్ నేడు ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే బుకింగ్స్ కోసం.. అన్ని ఏర్పాట్లు చేశారు సీఆర్డీఏ అధికారులు. రాష్ట్రంలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో సైతం ఈ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ బుకింగ్ విధానం, ఇంటర్నెట్ వినియోగం పట్ల అవగాహన లేని సాధారణ ప్రజలకు ఈ కేంద్రాల ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ గృహ సముదాయంలోని 900 ఫ్లాట్ల్లకు ఇవాళ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలకు సహాయపడేందుకు ఏపీసీఆర్డీయే విస్తృత సన్నాహాలు చేసింది. . ఆన్లైన్లో జరిగే ఈ ప్రక్రియపై సరైన అవగాహన లేని వారితోపాటు ఇంటర్నెట్ సదుపాయం లేనివారి కోసం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తోంది. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ బ్యాంకులు, మీసేవా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 9 గంటల నుంచి ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఆయా కేంద్రాల వివరాలు హ్యాపీనెస్ట్ వెబ్సైట్లో లభ్యమవుతాయి. కాగా.. ఈ బుకింగ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీఆర్డీయే శుక్రవారం నుంచి నిర్వహిస్తున్న సదస్సులు శనివారంతో ముగిశాయి. హ్యాపీనె్స్టలోని 3 టవర్ల(ఏ, బీ, సీ)లో ఉన్న 300 ఫ్లాట్లకు నవంబరు 9న బుకింగ్ ప్రారంభించగా కేవలం కొన్ని గంటల్లోనే ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో మలివిడతగా ఈ ప్రాజెక్ట్లోని మరొక 9 టవర్లు డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐ, జే, కే, ఎల్ లోని 900 ఫ్లాట్లకు ఇవాళ బుకింగ్ ప్రారంభించనున్నారు.
బుకింగ్దారులకు సీఆర్డీయే.. హ్యాపీనెస్ట్ వెబ్సైట్ ద్వారా కొన్ని సూచనలు చేసింది. బుక్ చేయాలనుకుంటున్న ఫ్లాట్లకు సంబంధించిన నగదు నెట్ బ్యాంకింగ్ లిమిట్లో లేనట్లయితే వాటిని పెంచాల్సిందిగా ఆయా బ్యాంకులను కోరాలని తెలిపింది. ప్రవాస భారతీయులు తమ చెల్లింపులను భారత కరెన్సీలోనే చెల్లించాలని సూచించింది. నగదును తమ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ల ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొంది. అంతర్జాతీయ బ్యాంకులకు చెందిన ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్బ్యాంకింగ్ అకౌంట్ల ద్వారా జరిపే చెల్లింపులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇక.. సులభంగా, త్వరగా బుక్ చేసుకునేందుకు ‘గూగుల్ క్రోమ్ 45, మొజిల్లా ఫైర్ఫాక్స్ 46, ఎడ్జ్ 13, సఫారీ 10 ఉండే నెట్వర్క్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ